తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.! ఈరోజు ఒక్కరోజే 75 పాజిటివ్ కేసులు…
కరోనా వైరస్ రోజు రోజుకి తెలుగు రాష్ట్రాలలో తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఈరోజు ఒక్కరోజే తెలంగాణాలో 75 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా ప్రజలంతా ఉలిక్కిపడ్డారు. ఇంతలా ఒక్కసారిగా పెరగడంతో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వాధికారులు వేడుకుంటున్నారు.
అధికారులు ఎంత చెప్పినా కొంతమంది వినకుండా ఇష్టానుసారంగా బయట తిరగడంతో ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారారు., ఈరోజు నమోదైన 75 కేసులతో తెలంగాణలో మొత్తం 229 కేసులకు చేరుకోవడం జరిగింది. ఇక తెలంగాణలో 11 మంది ఇప్పటి వరకు కరోనా వైరస్ తో చనిపోయారు. ఏపీలో ఈరోజు 21 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 2500 దాటడం జరిగింది.
తెలంగాణలో ఈరోజు మరో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.ఇప్పటి వరకు 229 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.— Minister for Health Telangana State (@TelanganaHealth) April 3, 2020
తెలంగాణలో కరోనా వైరస్ తో ఇప్పటివరకు 11 మంది మృతి చెందారు.ఈరోజు మరో 15 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.మొత్తం 32 మంది కోలుకున్నారు.186 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు pic.twitter.com/6aiRJcAgPY
Post a Comment